telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే..?

corona

ఏపీ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. అయితే ఇప్పటికే ఏపీలో 8.68 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. ఇందులో 8,54,326 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,427 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,996 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 18, చిత్తూరులో 95, తూర్పుగోదావరి జిల్లాలో 70, గుంటూరులో 87, కడపలో 30, కృష్ణాలో 146, కర్నూలులో 10, నెల్లూరులో39, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 71, విజయనగరంలో 9, పశ్చిమ గోదావరిలో 77 కేసులు నమోదయ్యాయి.

Related posts