అంబరీష్ భార్య సుమలత వచ్చే లోక్సభ ఎన్నికల నుంచే తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుడతానని అదికూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. సుమలత రాజకీయ ప్రవేశంపై నెల రోజులుగా చర్చలు సాగుతున్నాయి. అంబరీష్ సొంత జిల్లా అయిన మండ్య నుంచి పోటీ దాదాపు ఖరారైనా ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే ఉత్కంఠ ఉండేది.
మొదటి నుండి జేడీఎస్ లేదా కాంగ్రెస్ నుండి రంగంలోకి దిగనున్నట్టు .. లేదా స్వతంత్రంగా అయినా పోటీ చేయాలని ఆయా పార్టీలు కోరాయి. అయితే సుమలత కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని అంబరీష్ ఆశయం కూడా కాంగ్రెస్లో ఉండడమేనని స్పష్టం చేయడంతో జేడీఎస్కు షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉండగా మండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠంలో నిర్మలానందనాథ స్వామిజీని సుమలత, కుమారుడు అభిషేక్తో కలసి ఆశీర్వాదం పొందారు.
కేసీఆర్ ఓ తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారు: మాజీ ఎంపీ వివేక్