telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు: జగన్

YS Jagan Files Nomination Pulivendul
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు. సోమవారం అనంతపురంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్‌ లిస్టు నుంచి తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. 
మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామనినాలుగేళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. అన్నివర్గాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామన్నారు. ఎన్నికల్లో  చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని..ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. 

Related posts