దుబాయ్ లోని అజ్మాన్ మెరీనా బీచ్కు వెళ్లారు ఆ దంపతులు. అక్కడ సరదాగా గడిపిన అతని భార్య తన చేతి వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ను సముద్రంలో పారేసుకుంది. అదే సమయంలో సముద్రపు నీరు చల్లగా ఉండడంతో దంపతులు లోపల దిగే సాహసం చేయలేకపోయారు. దాంతో వెంటనే అజ్మాన్ సివిల్ డిఫెన్స్కు సమాచారం అందించారు. ఆ దంపతుల అభ్యర్థనకు పౌర రక్షణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందించారు. వెంటనే ఒక మెరైన్ డైవర్ను రంగంలోకి దింపారు. దాంతో డైవర్ రింగ్ పడిపోయిన చోటు నుంచి క్షణాల్లో వెతికి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను అజ్మాన్ పౌర రక్షణ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇక తమ జీవితాల ప్రత్యేక జ్ఞాపికను(వెడ్డింగ్ రింగ్) తిరిగి ఇచ్చినందుకు ఆ దంపతులు పౌర రక్షణకు కృతజ్ఞతలు తెలిపారు. అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దులాజీజ్ అలీ అల్ షంసీ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు ఏమాత్రం ఆలోచించకుండా 997కు ఫోన్ చేసి సివిల్ డిఫెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
next post