ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ షాక్ తగిలింది. అయితే ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ మొదటి మ్యాచ్ లో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కి ఆస్ట్రేలియా యువ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏప్రిల్ రెండో వారంలో జంపా పెళ్లి జరగనుంది. దీంతో ఐపీఎల్ 2021లో బెంగళూరు ఆడే తొలి మ్యాచ్కు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ధృవీకరించారు. ఐపీఎల్ 2020లో బెంగళూరు తరఫున 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన జంపా.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020 తర్వాత అతడు నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది భారత్తో జరిగిన వన్డే సిరీస్లో కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసాడు ఆస్ట్రేలియా తరపున 61 వన్డేల్లో 92 వికెట్లు, 41 టీ20ల్లో 43 వికెట్లు పడగొట్టాడు ఆడమ్ జంపా.
previous post
next post
మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర: యనమల