telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మరో నెల రోజుల పెరోల్ పొడిగించాలని కోరుతున్న నళిని!

nalini Ltte

రాజీవ్ గాంధీ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని కుమార్తె పెళ్లి నిమిత్తం నెల రోజుల పెరోల్ పై వేలూరు కేంద్ర కర్మాగారం నుంచి బయటకు వచ్చింది. కుమార్తె పెళ్లి కుదరలేదని నళిని, మరో నెల రోజుల పెరోల్ కావాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. గత నెల 20న వేలూరులోని సత్ వచ్చారి భవనంలో నివాసం ఉంటున్న ఆమె, నిత్యమూ పోలీసు స్టేషన్ లో సంతకం పెడుతోంది. కుమార్తె హరిద్ర వివాహం జరిపించేందుకు మరింత సమయం పడుతుందన్న ఉద్దేశంలో ఉన్న ఆమె, పెరోల్ ను పొడిగించాలని కోరుతోంది.

ఈ విషయాన్ని వెల్లడించిన నళిని తల్లి పద్మ, మనుమరాలికి వివాహం జరిపించేందుకు నలుగురిని చూశామని, ఆమె విదేశాల నుంచి రాగానే, వారిని చూపించి, ఒకరిని నిశ్చయం చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ వరకూ ఆమెకు పరీక్షలు ఉన్నందున భారత్ రాక ఆలస్యం అవుతోందని, అందువల్ల పెరోల్ పొడిగింపును కోరుతున్నామనిఅన్నారు.

Related posts