telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవివర్మ చిత్రాలకు ప్రాణం పోసిన స్టార్ హీరోయిన్లు… ఫోటోలు వైరల్

Ravivarma

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు మనదేశపు కళాసంపద. ఆయన గీసిన కొన్ని అద్భుత చిత్రాలకు మన దక్షిణాది నటీమణులు ప్రాణం పోశారు. ప్రముఖ నటి సుహాసిని స్థాపించిన నామ్ ఛారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ కోసం సమంత అక్కినేని, శృతిహాసన్, ఆశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ.. రాజా రవివర్మ చిత్రాల మాదిరి ముస్తాబై పోజులిచ్చారు. వీరిని ఫొటోగ్రాఫర్ జి.వెంకట్ రామ్ అద్భుతంగా తన కెమరాలో బంధించారు. 19వ శతాబ్దానికి చెందిన ఒరిజినల్ పెయింటింగ్స్ మాదిరిగానే ప్రస్తుత ఫొటోలను తీశారాయన. ఒక చేతిలో పండు పట్టుకుని మరో చేతితో చీర కొంగును సరిచేసుకుంటున్నట్టు ఉన్న తన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన కడుపున ఒక కాయ కాస్తుంది అని సింబాలిక్‌గా చెప్పే చిత్రమిది. ‘‘మీతో కలిసి పనిచేసిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంది వెంకట్ రామ్. నామ్ కోసం రవివర్మ గారి చిత్రాన్ని పునర్‌నిర్మించాం. ఒక అర్థవంతమైన ప్రాజెక్ట్‌లో నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ’’ అని సమంత తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతిహాసన్ శృతిహాసన్ రెండు రవివర్మ చిత్రాలకు ప్రాణం పోశారు. ఒకటి నది ఒడ్డున కూర్చున్న అమ్మాయి చిత్రం కాగా.. రెండోది కురుపాం రాణి పెయింటింగ్. ఈ ఫొటోలను శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కురుపాం రాణి గెటప్‌లో ఎంతో అందంగా కనిపించిన శృతిహాసన్.. ఊదారంగు చీరలో నది ఒడ్డున కూర్చున్న మహిళగానూ అంతే అందంగా కనిపించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ హీరోయిన్.. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు సుహాసినికి థ్యాంక్స్ చెప్పారు. ‘‘అక్క, ఒక మధుర జ్ఞాపకంలో నన్ను కూడా భాగం చేశారు’’ అని పేర్కొన్నారు. ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాతో మెప్పించిన తమిళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ కూడా రవివర్మ బొమ్మకు ప్రాణం పోశారు. వెంకట్ రామ్ క్యాలెండర్ షూట్‌లో పాల్గొన్న ఈ 29 ఏళ్ల నటి పుడుక్కొట్టాయి రాణిగా చాలా అందంగా కనిపించారు. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

రాణి చిమ్నాబాయి (మొదటి)గా మంచు లక్ష్మి భలే కుదిరిపోయారు. ముదురు ఊదా రంగు చీరలో టీవీగా చూస్తూ మెరిసిపోయారు. రాజా రవివర్మ చిత్రానికి మళ్లీ ప్రాణం పోశారు. ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. ఇప్పుడు రవివర్మ గీసిన విదర్భ యువరాణి దమయంతి చిత్రానికి ప్రాణం పోశారు. అచ్చం రవివర్మ గీసిన దమయంతి చిత్రం ఎలా ఉందో రమ్యకృష్ణ కూడా అంతే అందంగా ఉన్నారు. బొద్దుగా కుందనపు బొమ్మలా ఉండే సీనియర్ నటి ఖుష్బూ.. రవివర్మ గీసిన మరాఠి మహిళ చిత్రానికి ప్రాణం పోశారు. రవివర్మ గీసిన మహిళ చిత్రంలోని పండ్లు, ఆమె ఆభరణాలు మినహాయిస్తే అచ్చం ఆ మహిళ మాదిరిగానే ఉన్నారు ఖుష్బూ.

Related posts