దిశ కేసు నిందితులను పోలీసులు ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులతో వనపర్తి ఎస్పీ అపూర్వారావు మాట్లాడారు. అనంతరం మక్తల్ సీఐ శంకర్ బృందంతో చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు మృతుల తల్లిదండ్రులు బయల్దేరారు. నారాయణపేట జిల్లా గుడిగండ్ల, జక్లేర్ నుంచి మృతుల తల్లిదండ్రులను పోలీసులు తీసుకెళ్లారు.
ఘటనాస్థలికి బయల్దేరిన వారిలో ఏ1 మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్, ఏ2 చెన్నకేశవులు తండ్రి కురుమప్ప, ఏ3 జొల్లు శివ తండ్రి రాజప్ప ఏ4 జొల్లు నవీన్ తల్లి లక్ష్మి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే నలుగురి మృతదేహాలకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు శవపంచనామా నిర్వహించారు. మరికాసేపట్లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు.