telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసులో.. హంతకులను పట్టుకోండి: జగన్ ఆదేశాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకేసులో అసలు హంతకులను పట్టుకోవాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పులివెందులలోని తన నివాసంలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు వివేకా హత్యకు గురయ్యారు.

ఈ కేసులో ప్రస్తుతం వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరుడు దొండవాగు శంకర్, పనిమనిషి కుమారుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా వున్నారు. నిన్న వివేకా కుమార్తె సునీత జగన్ ను కలిసి, ఈ కేసులో అసలు హంతకులను పట్టుకోవాలని విన్నవించిన సంగతి తెలిసిందే.

Related posts