గుడివాడ క్యాసినో రగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది.. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య వార్ రోజు రోజుకి ముదురుతోంది. గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనతో మొదలైన రచ్చ.. రగులుతూనే ఉంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్ .
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. వైసీపీ చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. మూడు రాజధానులను తెలుగుదేశం పార్టీ కేసులు వేసి అడ్డుకుంటోందని రాంబాబు మండిపడ్డారు. గోవా కల్చర్ను గుడివాడకు తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారి అంబటి విమర్శించారు.
గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు, పేకాట అన్నీ చట్ట వ్యతిరేకమే.. కోడిపందాలు మా సంస్కృతి అని సుప్రీంకోర్టుకి వెళ్లిన వారు మీవైపే ఉన్నారు కదా అని అయన ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో వున్నప్పుడు క్లబ్బులు పెట్టలేదా అని అంబటి ప్రశ్నించారు.రామోజీ రావు కూడా గుడివాడ దగ్గరే పుట్టారని, 365 రోజులూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న బెల్లీ డ్యాన్స్ లు టీడీపీకి కనిపించడం లేదా అంటూ ఆయన విమర్శించారు. ఆ మూడు రోజులు కొడాలి నాని కరోనా తో ఏఐజీలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.
వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు