telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు.

పులివెందుల ప్రజలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పులివెందుల‌తో లోతైన అనుబంధాన్ని వ్య‌క్తం చేస్తూ, పులివెందుల‌ ఎప్పుడూ త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని, అదే త‌న జీవితం అని పేర్కొన్నారు.

జై జగన్ నినాదాలతో పులివెందుల మారుమ్రోగింది. సీఎస్‌ఐ మైదానంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

తన ప్రసంగంలో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై విమర్శలు గుప్పించారు.

అవినాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts