telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ సింగిల్‌గా వస్తారు.. భారీ మెజార్టీ సాధిస్తారు: షర్మిల

ys sharmila press meet

చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.గతంలో బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తారు.. భారీ మెజార్టీ సాధిస్తారని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ షర్మిల రోడ్‌ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌ పోరాటం వల్లనే హోదా అంశం ఇంకా సజీవంగా ఉందన్నారు.

అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్ చంద్రబాబు అని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడంకోసం అనేక బాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రజలను మోసం చేశారని, ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని మండిపడ్డారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ను మాత్రం మూడు శాఖలకు మంత్రిని చేశారని ధ్వజమెత్తారు.

Related posts