telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్‌ లో తగ్గని కరోనా .. ఒకేరోజు 895 మంది మృతి

భారత్ లో కరోనా విజృంభిస్తునే వుంది. తాజా కేసులతో దేశంలో 73 లక్షలు దాటింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 895 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 73,70,469 కాగా ….దేశ వ్యాప్తంగా “యాక్టీవ్” కేసులు 8,04,528 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,53,780 కి చేరింది.

“కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,12,161 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 87.36 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 11.12 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 10,28,622 కాగా..ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం “కరోనా” టెస్ట్ ల సంఖ్య 9,22,54,927 కి చేరింది.

Related posts