*చిన్నారులను నగ్నంగా నిలబెట్టి చితకబాదారు
*ఆపై సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ..
హైదరాబాద్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకుంటూ గడుపుతు న్న 16 మంది చిన్నారులపై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు . చిన్నారుల దుస్తులు ఊడదీసిన నిందితులు.. పిరుదులపై, వీపుపై కర్రతో చితకబాదారు.
ఈ సంఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్లాబండ గుట్టపై చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే..
గత నెల 29న ధూల్పేట్ పరిధిలోని ఓ కొండపై అల్లాబండ్డ పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు కొందరు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన హరికిరణ్, అమోస్, రాహుల్ అనే యువకులు పేటాక ఆడుతున్న 16 మంది పిల్లల దుస్తులు ఊడదీసి బెదిరించడమేగాక, కర్రలతో బాదారు. ముగ్గురిలో మరో యువకుడు వీడియో తీసి మంగళవారం సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.
మంగళవారం చిన్నారులు స్నానం చేసే సమయంలో.. వారి వీపు, పిరుదులపై కమిలిపోయిన గాయాలున్న ట్లు కొందరు తల్లిదండ్రులు గుర్తించారు. దాంతో చిన్నారులు జరిగిన దారుణాన్ని వారికి వివరించారు. ఈ అమానుషంపై ఆరుగురు బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. .కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు.