తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి.
ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజల అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు, వినతులను ఉంటే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా అందించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ప్రజాకోర్టులో సీఎం కేసీఆర్ను దోషిగా చూపుతాం: కె లక్ష్మణ్