తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
కార్మిక సమ్మె40వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరమని అన్నారు. మహబూబ్ నగర్ డిపో డ్రైవర్ ఆత్మహత్య దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.