telugu navyamedia
వ్యాపార వార్తలు

భారత్‌లో యాహూ న్యూస్‌ వెబ్‌సైట్‌ మూసివేత

భారతదేశం లో యాహూ సంస్థ న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్‌ కంటెంట్‌ను ఇది నియంత్రిస్తోంది. మూసివేస్తున్న వెబ్‌సైట్లలో యాహూ న్యూస్‌, క్రికెట్‌,ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌ ఇండియా ఉన్నాయి. భారత్‌లో యాహూ మెయిల్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ వినియోగించే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.

అమెరికాకు చెందిన వెబ్‌ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్‌ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్‌ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్‌, సెర్చ్‌ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది.

ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్‌.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్‌ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది.

డిజిటల్‌ కంటెంట్‌.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్‌ కంటెంట్‌ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Related posts