దేశంలో ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రజల సమస్యలను నిర్మొహమాటంగా అందరికీ తెలిసేలా.. ఈ సోషల్ మీడియా సంస్థలు ఉపయోగపడుతున్నాయి. ఈ సంస్థల ద్వారా అనర్ధాల కంట ఉపయోగాలే ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించక పోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఫిబ్రవరి 26న ఓటీటీ మాధ్యమాల్లో మూడో అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. దీని ప్రకారం ఓటీటీ డిజిటల్, న్యూస్ మాధ్యమలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆరోజే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఈ సంస్థలు స్పందించలేదు..ఒకే ఒక సంస్థ మాత్రం కేంద్ర నిబంధనలకు అంగీకరించింది.
సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు:
ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే.
ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి.
లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి.
జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలి. అయితే ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులతో పాటు మరిన్ని నిబంధనలు చేర్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర అధికార వర్గాలు పేర్కొన్నాయి.


తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు