telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం లో నేరస్తులను తేల్చడానికి త్వరలోనే కమిటీ వేస్తాం: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రుల మీడియా సమావేశం జరిగింది.

వైసీపీ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగినట్లు 2022లోనే ఎన్సీఆర్టీఐ నివేదిక, సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు ఉన్నాయి లడ్డూలో కల్తీ సహజమే అని వాళ్లే అంటున్నారు.

తెలిసే తిరుమలలో అక్రమాలు జరిగాయి  NDDB నివేదిక ఆధారంగానే చంద్రబాబు లడ్డూపై మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు కావు స్వయంగా NDDB నివేదిక ఇచ్చింది.

లడ్డూలో జంతుకొవ్వులు,పామాయిల్ ఉన్నట్లు NDDB నివేదిక ఇచ్చింది. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే నాడు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?  2022 NCRTI రిపోర్ట్ ఇచ్చింది కానీ నాటి వైసీపీ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది.

బోలే బాబా డెయిరీ నుంచి కమీషన్లు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పింది.

ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడ్డారని సిట్ చెప్పింది పాలు సేకరించేందుకు మూడు నిబంధనలు ఉన్నాయి కానీ నాటి టీటీడీ బోర్డు ఆ నిబంధనలను ఎత్తేసింది.

శ్రీవారికి అపచారం చేసిన వైవీ సుబ్బారెడ్డిని నేరస్తులుగానే చూడాలని సిట్ చెప్పింది. ఫేక్ డాక్యుమెంట్లతో నెయ్యి టెండర్లు పెట్టారు టెండర్లను పూర్తిగా డైల్యూట్ చేశారు.

నేరస్తులను తేల్చడానికి త్వరలోనే కమిటీ వేస్తాం జరిగిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు

Related posts