గుజరాత్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. బనస్కంత జిల్లా లకానీ తాలుకా కుడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.21 లక్షల అప్పు తిరిగి చెల్లించని కారణంగా హత్య చోటుచేసుకున్నట్లుగా సమాచారం. హత్య చేయడానికి గల కారణాన్ని నిందితుడు ఇంటి గోడలపై స్పష్టంగా రాశాడు.
తీసుకున్న డబ్బులు రూ. 21 లక్షలు తిరిగి చెల్లించని కారణంగా హత్య చేసినట్లు నిందితుడు గోడలపై రాతల ద్వారా తెలియజేశాడు. రక్తపు మడుగుల్లో పడిఉన్న మృతదేహాలను పొరిగింటి వారు చూడంటంతో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, భర్త, కొడుకు, కూతురు హత్యకు గురయ్యారు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్