టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో అందమైన ప్రకృతి ప్రదేశాల్లో ఆనందంగా విహరిస్తున్నారు. న్యూజిలాండ్ టూర్ మధ్యలో బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తమ ఫోటోలను పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన లొకేషన్లో ఈ ఫోటోలను దిగారు. కోహ్లీ ఈ ఫోటోలను షేర్ చేయగానే వాటిని లక్షల్లో లైకులు, షేర్లు వచ్చాయి. హాలీడేకు వెళ్తున్నట్టు కోహ్లీ అంతకుముందే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అప్డేట్ ఇచ్చేశారు. ఇటీవలే అమితానందాన్ని శ్వాస దూరంలో ఉన్నానంటూ అనుష్క కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డిసెంబర్ 2017లో కోహ్లీ, అనుష్క పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు.