telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజ‌య‌శాంతి సినిమా అంటే… వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశాను : విజయశాంతి

Vijaya

మ‌హేశ్‌బాబు, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా విడుద‌ల‌వుతుంది. దాదాపు 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ విజ‌య‌శాంతి ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె భారతి అనే ప‌వ‌ర్‌ఫుల్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ “అస‌లు సినిమాలు చేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ప్పుడు అనిల్ న‌న్ను క‌లిశారు. అంత‌కు ముందు మ‌రో సినిమా కోసం అనిల్ న‌న్ను క‌లిసిన‌ప్పుడు నేను బిజీగా ఉండ‌టం వ‌ల్ల కుద‌ర‌ద‌ని చెప్పేశాను. మ‌ళ్లీ `సరిలేరు నీకెవ్వ‌రు`లో న‌టించాల‌ని కోరారు. కాస్త ఫ్రీగా ఉండ‌టంతో క‌థ చెప్ప‌మ‌ని అడిగాను. అనిల్ క‌థ చెప్పారు. బావుంద‌ని అన్నాను. క‌థ‌లో అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి. క‌థ బావుంద‌ని చెప్పిన త‌ర్వాత న‌టించ‌క‌పోతే బావుండ‌దు కాబ‌ట్టి నా వీలును బ‌ట్టి న‌టించ‌డానికి అంగీక‌రించాను. విజ‌య‌శాంతి సినిమా అంటే అంచ‌నాలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే సినిమా చేశాను” అని అన్నారు విజ‌య‌శాంతి.

Related posts