సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. భద్రతా పరికరాల కొనుగోలులో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనను సస్పెండు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
ఏబీ సస్పెన్షన్ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అధికారులంతా గజగజావణికిపోతున్నారని, డిప్యుటేషన్ పై కేంద్రానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఎల్లో మీడియా రేపో, మాపో సిగ్గులేని రాతలు రాస్తుందని ట్వీట్ చేశారు. “నిప్పు నాయుడే అసూయపడేంత నిజాయతీపరుడ్ని సస్పెండ్ చేస్తారా?” అని విషప్రచారం మొదలుపెడుతుందన్నారు.
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు