ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
“విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో శుక్రవారం సాయంత్రం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ జి.వి.ఎల్. నరసింహారావు గారికి అభినందనలు.
రైతు బిడ్డగా పుట్టిన నాకు రైతులంటే ఎంత అభిమానమో రైతులకు సంబంధించిన పండుగలన్నా అంతే ఆసక్తి. తెలుగు లోగిళ్ళకు తొలి కాంతిని తీసుకువచ్చే సంక్రాంతి, అచ్చంగా తెలుగు రైతుల పండుగ.
పండుగ అంటే కొత్తబట్టలు, పిండి వంటలే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు. మన ఆచార వ్యవహారాలు.
మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి, పదిమందికీ సాయం చేయాలనే భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేసే మార్గాలే పండుగలు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి.
సంక్రాంతి అంటే అది ప్రకృతి పండుగ. ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలి.
ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతితో కలిసి జీవించాలి. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే భారతీయ సంస్కృతి కీలక భావన షేర్ అండ్ కేర్ సంక్రాంతిలో కనిపిస్తుంది” అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేసారు.
.

