హరీష్ రావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధిపేట నుండి భారీ మెజారిటీ తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే తెరాస లో ప్రధాన నాయకులుగా ఉన్న ఆయన ను లోక్ సభ కు పంపించే యోచన ఉన్నందున, నాలుగు నెలలలో జరిగే ఎన్నికలలో ఆయన పోటీకి దిగనున్నారు. ఇక సిద్దెపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన భార్య బరిలోకి దిగనున్నారు. ఈ విషయాలు అన్ని, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్ రమ్యారావు ఆసక్తికర పోస్టును పెట్టారు.
కాంగ్రెస్ కు చెందిన వాట్స్ యాప్ గ్రూప్ లో ‘తాజా తెలంగాణ’ హెడ్డింగ్ తో ఆమె ఈ పోస్ట్ పెట్టారు. “మరో 4 నెలల్లో సిద్ధిపేటకు బై ఎలక్షన్. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత” అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ రావును పార్లమెంట్ కు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రమ్యారావు పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.