ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. నేడు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆమెకు స్వల్పంగా నలతగా అనిపించడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనితకు రక్తపోటు (బీపీ) పెరిగినట్టు వైద్యులు తెలిపారు. మండలి సమావేశాలు వాయిదా పడిన తర్వాత, అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు.
దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హోంమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం.


చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి