హైదరాబాద్ సీపీపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడిన భాష సరికాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తొత్తు’ అంటూ ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంజనీకుమార్ అవినీతిపరుడన రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ ర్యాలీ, దారుస్సలాంలో ఎంఐఎం సభకు అనుమతిచ్చారని, తమకెందుకు అనుమతి ఇవ్వబోరని ఉత్తమ్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఒవైసీ ఉత్తమ్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక. ఈ భారీ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా బహిరంగ సభ నిర్వహించారని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.