telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఊరుకోం…టీడీపీ వార్నింగ్‌

Ayyanna

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేంది లేదని టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేందుకు పోలవరం ఆ పార్టీ నేతల ఇంటి ప్రహరీ కాదని ఆక్షేపించారు అయ్యన్న పాత్రుడు. విశాఖను దోపిడి చేస్తూ.. అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు వైసీపీ చేసిందేముందని నిప్పులు చెరిగారు. ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైసీపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు అయ్యన్న పాత్రుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు అయ్యన్న పాత్రుడు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలకు ఎక్కడా.. న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు వైసీపీ పాలనలో సంతోషంగా లేరని తెలిపారు. 

Related posts