telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాదే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగుస్తుంది : ప్ర‌కాష్‌ జ‌వ‌దేక‌ర్

praksh javadekar

కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాష్‌ జ‌వ‌దేక‌ర్ తాజాగా మాట్లాడుతూ… దేశ ప్ర‌జలంద‌రికీ ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై.. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇవాళ్ల ప్ర‌ధాని మోడీ, కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో కౌంట‌ర్ ఇచ్చిన ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్.. 2021లోపే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగుస్తుంద‌న్నారు. ఇక‌, వ్యాక్సిన్లపై రాహుల్ గాంధీ ఆందోళ‌న చెందితే… ఆయ‌న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ గంద‌ర‌గోళంగా సాగుతోంద‌ని ఆరోపించిన కేంద్ర మంత్రి… 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను కూడా వాళ్లు తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. కాగా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు కూడా టీకాలు కొనడానికి గ్లోబ‌ల్ టెండ‌ర్లకు పిలిచిన సంగ‌తి తెలిసిందే.

Related posts