telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కరోనా పై పోరాటానికి ధోనీ లక్ష, సచిన్ రూ.50లక్షలు

sachin

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్థికంగా సాయం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ లక్ష రూపాయలు విరాళమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేడియంలో అభిమానులు వచ్చి కాళ్లు మొక్కే ధోనీ లక్షయేనా ఇచ్చేదంటూ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోలా చూస్తే ధోనీ ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకోలేదు. ఇంకా వేరే విధంగా డొనేట్ చేశాడో లేదో క్లారిటీ కూడా లేదు. రూ.800 కోట్ల సంవత్సర ఆధాయం వచ్చే ధోనీ విరాళంపై చర్చ నడుస్తుండటం మాత్రం ఆశ్చర్యమే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. మనమంతా ప్రశాంతంగా ఉండాలని అలాగే కరోనాను ఎదుర్కోగలమని సూచనలిచ్చాడు. టెస్టు క్రికెట్ లోనూ మా ప్రధాన ఆయుధం ఇదే అని చెప్పాడు. షార్ట్ ఫార్మాట్ ను నమ్ముకోకుండా.. టెస్టు క్రికెట్ పార్టనర్ షిప్ మాదిరి ప్రశాంతంగా టీం వర్క్ చేసి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చాడు.

Related posts