బాలీవుడ్ హీరోయిన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలు సామజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటారు. ట్వింకిల్ ఖన్నా తాజాగా జెఎన్యూలో చోటుచేసుకున్న హింసాకాండపై స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. “భారత్… ఇక్కడ ఆవులకే విద్యార్థుల కన్నా అధిక రక్షణ లభిస్తుంది. అయితే భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదు. మీరు హింస ద్వారా జనాలను అణచివేయలేరు. అలా చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది. నిరసన ప్రదర్శనలు పెరుగుతాయి. రోడ్డుపైకి జనాలు వస్తారు” అని ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో హీరో వెంకటేష్ సరసన ‘శీను’ చిత్రంలో నటించిన ట్వింకిల్ ఖన్నా తరువాతి కాలంలో బాలీవుడ్ సినిమాల్లో నటించారు. అక్షయ్ కుమార్ తో వివాహం అనంతరం సినిమాకు దూరంగా ఉంటున్నారు.
previous post
next post
బిగ్ బాస్ పై రేణూదేశాయ్ కామెంట్స్