telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విలేఖరితో స్టార్ హీరోయిన్ గొడవ… వీడియో వైరల్

KAngana-Ranauth

కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం “జడ్జిమెంటల్‌ హై క్యా”. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో కథ సాగుతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆ మర్డర్ కంగనా, రాజ్ కుమార్ రావులలో ఎవరో ఒకరు చేశారని పోలీసులు అనుమానిస్తుంటారు. కొద్దిగా మతిస్థిమితం లేని బాబీ అనే పాత్రలో కంగనా మంచి నటన కనబరిచింది. రాజ్ కుమార్ రావు.. కేశవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. కథ మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేకరి కంగనాను సినిమా గురించి ప్రశ్నిస్తుండగా.. ఆమె మధ్యలో కలగజేసుకొని “మీరు నేను నటించిన మణికర్ణిక సినిమా గురించి అలా రాయడం తప్పని అనిపించడం లేదా.? అలాంటి సినిమా తీసి నేనేమైనా తప్పు చేశానా..? నా గురించి అలా ఇష్టమొచ్చినట్లు ఎలా రాస్తారు..?” అని అడిగింది.

దీనికి సదరు విలేకరి సమాధానమిస్తూ.. “నేనెప్పుడు మీ గురించి తప్పుగా రాశారు..? మీరో స్టార్ హీరోయిన్ అయినంతమాత్రాన ఓ విలేకరిని ఇలా బెదిరిస్తున్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. దీనికి కంగనా.. ‘మణికర్ణిక సినిమా సమయంలో మీరు నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు.. నా వ్యానిటీ వ్యాన్ లో కూర్చొని మూడు గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. మనమిద్దరం కలిసి భోజనం కూడా చేశాం” అని అన్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందని సదరు విలేకరి ఆశ్చర్యపడుతూ అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధాన్ని తలపించాయి. కంగనా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts