ఏపీ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో మంగళగిరిపై అందరి చూపు పడింది. లోకేశ్ ను ఎలాగైనా ఓడిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఓ ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలోని కీలకమైన మంగళగిరి నుంచి తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈమేరకు ఆమె సోమవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు.