telugu navyamedia
వార్తలు సామాజిక

వలస కూలీల తరలింపుకు నిత్యం రైళ్లు నడపండి: కేంద్రం

special train between vijayawada to gudur

వలస కూలీల తరలింపుకు శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రాలతో మాట్లాడి నిత్యం శ్రామిక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డీఎం, డీఆర్‌ఎంలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని వివరించింది.

రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు రైళ్ల రాకపోకలు అందుబాటులో ఉండాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించింది. రైళ్లు నడిపే అధికారాన్ని జోనల్ రైల్వే అధికారులకే ఇచ్చినట్లు వెల్లడించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలో జోనల్ రైల్వేలే ఖరారు చేస్తాయని వెల్లడించింది. వలస కూలీల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts