telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

వ్యానును బలంగా ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

Accident

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల వద్ద ఈరోజు ఉదయం వ్యానును బలంగా లారీ ఢీకొట్టిన ఘటనలో ప్రమాదంలో విశాఖపట్నంలో ఒకే కేటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు విశాఖలోని ఓ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు వ్యానులో ఏలూరు వైపు వెళ్తున్నారు.

నల్లజర్ల వద్దకు వీరి వ్యాను వచ్చే సరికి ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఓ పురుషుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగిలిన వారికి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Related posts