కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ లో మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. యూపీఎస్సీ పరీక్షల కోసం మెట్రో రైళ్ల సర్వీసు సేవలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ మెట్రో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అక్టోబర్ 4న ఉదయం 6 గంటలకు మెట్రో సేవలను ప్రారంభించనుంది. ఈ అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ట్వీట్ చేసింది.
యూపీఎస్సీ పరీక్షకు విద్యార్థులను సులభతరం చేయడానికి, అక్టోబర్ 4న అన్ని లైన్ల టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కోవిడ్-19 మరియు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలను దృష్టిలో ఉంచుకుని యూపీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని అంతకుముందు సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విధితమే.