టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన చెన్నై బ్యూటీ త్రిష ఈరోజు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను. మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసింది త్రిష.
Beautiful @trishtrashers accepted the #GreenindiaChallenge 🌱 from @prakashraaj and planted saplings at her residence.
Requested everyone to self nominate for this great initiative. 💚 #HarithaHaaram @MPsantoshtrs pic.twitter.com/ZgMvpl1abW— BARaju (@baraju_SuperHit) October 3, 2020