telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైరెక్టర్ గా మారతానంటున్న యంగ్ హీరో

nikhil

‘అర్జున్ సుర‌వ‌రం’తో ఇటీవలే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నిఖిల్… లాక్ డౌన్ సమయంలో పెళ్లితో ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. నిఖిల్ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో “18 పేజెస్”‌లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి అయితే ఇన్నిరోజులు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో త్వరలో డైరెక్టర్ గా మారుతానని అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటుడు కాకముందు ‘హైదరాబాద్ నవాబ్స్’ చిత్రానికి లక్ష్మీ కాంత్ చెన్న వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు నిఖిల్. ఆ అనుభవంతో ఇప్పుడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు. త్వరలో ఒక ప్రయోగాత్మక పిల్లల చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. కాగా ఇటీవలే నిఖిల్ తన 20వ సినిమాను కూడా ప్రకటించాడు.

Related posts