సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి ఫస్ట్ సింగిల్ రికార్డు సృష్టించింది. తాజాగా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుకను అదించింది సర్కారువారి పాట చిత్ర యూనిట్.
ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ఈ పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. .ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ పొస్టర్ చూస్తే సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.