telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముంబై : … ఈడీ ముందుకు స్వచ్చందంగా పవార్ .. 144 సెక్షన్..

Loksabha Elections MP Contest Sharad pawar

బ్యాంకు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు స్వచ్ఛందంగా వస్తున్న నేపధ్యంలో పోలీసులు నగరంలో నిషేధ ఉత్తర్వులు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు శరద్ పవార్ ఈడీ కార్యాలయానికి రానున్న దృష్ట్యా ముంబై నగరంతోపాటు పలుప్రాంతాల్లో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా 144 సెక్షన్ ను విధించారు.

పరోలా, ముక్తాయ్ నగర్, ఉస్మానాబాద్ పట్టణాల్లో ఎన్సీపీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. ముంబై నగరంలోని కొలబా, కుఫీ పరేడ్, మెరెన్ డ్రైవ్, ఆజాద్ మైదాన్, డోంగ్రీ, జేజే మార్గ్, ఎమ్మారే మార్గ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్సీపీ కార్యకర్తలు గుమిగూడకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Related posts