telugu navyamedia
క్రైమ్ వార్తలు

ముగ్గురు యువతుల ఆత్మహత్య..

జగిత్యాల జిల్లాలోని ఉప్పరిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య క‌ల‌కలం రేపుతోంది.

ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, మరో యువతి ఇంటర్ చదువుతోంది. ఉప్పరిపేట గ్రామంలో ఒకే వీధికి చెందిన ముగ్గురు యువతులు గంగాజల దేవి, మల్లిక, వందనలుగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం బుధవారం రోజంతా గాలించారు. ఈ ముగ్గురు బంధువులేనని స్థానికులు పోలీసులకు చెప్పారు.

ఆ మృతదేహాలు వెలికితీసిన పోలీసులు వారిని.. అదృశ్యమైన యువతుల్లో గంగాజల, మల్లికలుగా గుర్తించారు. మరో యువతి వందన కోసం చెరువులో గాలించగా.. కాసేపటికి మూడో యువతి మృతదేహాం కూడా దొరికింది. వీళ్ల ముగ్గురూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Related posts