మాటల మాంత్రికుడు , త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. చినబాబు నిర్మాతగా వ్యవహరించగా, తమన్ అందించిన సంగీతం దేశవ్యాప్తంగా మార్మ్రోగిపోయింది. ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతోంది.
త్వరలో ఇదే కాంబినేషన్లో మళ్ళీ ఓ భారీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానుందని టీమ్ వెల్లడించింది. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కలిసి ఉన్న ఓ పిక్ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
దీనితో ఈ కాంబో నుంచి ఓ బిగ్ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో అనౌన్స్ అవ్వబోతున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు. మరి మహేష్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి మరి.
a suprise coming up very soon @haarikahassine pic.twitter.com/I8wECi7JEH
— Naga Vamsi (@vamsi84) October 28, 2021
అమితాబ్ తో రిలేషన్ గురించి రేఖ కామెంట్స్