అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది.
డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు.
అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్ చేస్తూ 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంజనీ కుమార్, అభిలాష బిస్త్ డీజీ ర్యాంక్లో ఉండగా, అభిషేక్ మహంతి ఎస్పీ ర్యాంక్లో కొనసాగుతున్నారు.
ఈ ముగ్గురికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన కేంద్ర హోం శాఖ వెంటనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది.
అయితే ఈ ఆదేశాలపై ఐపీఎస్ లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ముగ్గురిని కూడా కేంద్రం ఏపీకి అలాట్ చేసింది.
కానీ, ఆ నిర్ణయాన్ని వీరు ముగ్గురు సవాల్ చేస్తూ క్యాట్ని ఆశ్రయించారు. అక్కడ వీరి అలాట్మెంట్ కు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.


అధిక ధరలకు ఇసుక బస్తాల విక్రయం: చంద్రబాబు