నా కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో గందరగోళానికి గురయ్యేవాడినని, తన సమస్యను గమనించిన ధోనీ.. షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని గుర్తు చేసుకున్నాడు రవీంద్ర జడేజా. ధోనీ చెప్పేంత వరకు షాట్ ఆడాలా వద్దా? ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని పేర్కొన్నాడు. దాంతో తికమక పడుతూ ఆడేవాడినని వెల్లడించాడు. గత రెండేళ్లుగా జడేజా కెరీర్ దూసుకుపోతుంది. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ నుంచి అతను అటు బ్యాటింగ్, ఇంటు బౌలింగ్లోనూ దుమ్మురేపుతున్నాడు. లోయర్ ఆర్డర్లో విధ్వంసకరంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. షార్ట్పిచ్ బంతుల్ని సిక్సర్లుగా మలిస్తే ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. బౌన్సర్లతో నాకెప్పుడూ ఇబ్బంది అనిపించలేదు. ఎక్కువసార్లు ఔటైనట్టూ కూడా గుర్తులేదు. ఆడలేననీ నాకూ అనిపించలేదు. నా షాట్ల ఎంపిక ముఖ్యమని అర్థమైంది’ అని జడేజా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మార్పుకు ధోనీ ఇచ్చిన సలహానే కారణమని జడేజా స్పష్టం చేశాడు. కావాల్సిన సమయం తీసుకొని ఆడితే పరుగులు అవే వస్తాయన్నాడని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడినా.. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సమాయత్తం అవుతున్నాడు.
previous post
next post
నీ స్పీడ్ కాంగ్రెస్ లో చెల్లదు ..రేవంత్ కు వీహెచ్ చురకలు