ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధంపై నూతన విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యపాన నిషేధంపై జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.
శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యపాన నిషేధంపై ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. మద్యం కారణంగా చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయని చెప్పారు. సీఎం జగన్ కొత్త నిర్ణయాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని అన్నారు. దశలవారీ మద్య నిషేధంతో ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన ఆశించారు.