శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస దగ్గర ఒక లగేజ్ వ్యాన్… బావిలో పడిపోయింది. బావి నీటిలో వ్యాన్ పూర్తిగా మునిగిపోయింది. వాహనంలో డ్రైవర్తో పాటు మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… బావిలో నీటిని తోడి వేయిస్తున్నారు. వాహనాన్ని బయటికి తీసిన తర్వాతే అందులో ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని చెబుతున్నారు. రోడ్డు పక్కనే పొలంలో ఉన్న బావిలో… ఇవాళ తెల్లవారుజామున వ్యాన్ పడిపోయింది. వ్యాన్ అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి బావిలో పడి ఉంటుందని భావిస్తున్నారు.
previous post
నాయకుల స్వార్థంతో రాజధాని మార్చాలని నిర్ణయం: యనమల