ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు.
అయితే, నేడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు.
కేవలం ఏడాది వ్యవధిలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని, త్వరలో టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీల క్యాంపస్లు కూడా రాబోతున్నాయని తెలిపారు.