మహారాష్ర్టలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ 107 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ ను జయించింది. వృద్ధురాలితో పాటు ఆమె కూతురు(78), కుమారుడు(65) తో పాటు 20 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో వారందరు జల్నా సిటీలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత కరోనా టెస్టులు చేయగా ఫలితం నెగిటివ్ వచ్చింది. దీంతో ఈ ఐదుగురిని గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మహారాష్ర్టలో ఇప్పటి వరకు 6,43,289 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో 1,62,491 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ వైరస్ నుంచి 4,59,124 మంది కోలుకున్నారు.