telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్ ఆదేశాలతో ఆంద్రప్రదేశ్ లోని సీఐడీ కార్యాలయం సీజ్ చేశారు.

తాడేపల్లిలోని సీఐడీ  కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.

సీఐడీ కార్యాలయం సమీపంలో హెరిటేజ్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ మార్పుతో విలువైన, కీలకమైన డాక్యుమెంట్లు మాయం అవుతాయని అనుమానంతో సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతి కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు.

ఈ ఆదేశాల్లో భాగంగానే తాడేపల్లి సీఐడీ  కార్యాలయానికి తాళాలు వేసి అధికారులు సీజ్ చేశారు.

Related posts