telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బస్‌ టిక్కెట్ల పై అన్యమత ప్రకటనలపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఈడీ

apsrtc charges increased shortly

తిరుపతి ఆర్టీసీ బస్‌ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనల పై రాష్ట్రవ్యాప్తంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్‌ రావు శుక్రవారం వివరణనిచ్చారు. ఆ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవని ఆయన వెల్లడించారు.

గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్‌ తిరుపతి డిపోకు వచ్చాయని తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం కనుక మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Related posts